మే 17 వరకు ఢిల్లీ మెట్రో రైళ్ల రాకపోకల రద్దు

ABN , First Publish Date - 2021-05-10T14:56:43+05:30 IST

దేశ రాజధాని నగరంలో వ్యాప్తిచెందుతున్న కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు మెట్రోరైళ్ల రాకపోకల రద్దును మే 17వతేదీ వరకు పొడిగించారు....

మే 17 వరకు ఢిల్లీ మెట్రో రైళ్ల రాకపోకల రద్దు

న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరంలో వ్యాప్తిచెందుతున్న కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు మెట్రోరైళ్ల రాకపోకల రద్దును మే 17వతేదీ వరకు పొడిగించారు. ఢిల్లీలో లాక్ డౌన్ గడువును పెంచిన నేపథ్యంలో మే 17వతేదీ ఉదయం 5 గంటల వరకు మెట్రోరైలు సర్వీసులను నిలిపివేయాలని నిర్ణయించినట్లు మెట్రోరైల్ అధికారులు తాజాగా ప్రకటించారు. కరోనా కట్టడి కోసం మరో వారం రోజుల పాటు లాక్ డౌన్ ను సీఎం అర్వింద్ కేజ్రీవాల్ పొడిగించారు. దీంతో మెట్రోరైలు సర్వీసులను కూడా మే 17వతేదీ వరకు  నిలిపివేశామని ఢిల్లీ మెట్రోరైలు కార్పొరేషన్ సోమవారం ట్వీట్ చేసింది. ఢిల్లీలో  శనివారం 13,336 కరోనా కేసులు నమోదు కాగా 273 మంది మరణించారు. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీలో లాక్ డౌన్ తో పాటు కఠిన ఆంక్షలు విధించారు.

Updated Date - 2021-05-10T14:56:43+05:30 IST