ఢిల్లీ ‘స్థానికం‘: ఐదు వార్డుల్లో 4 ‘ఆప్’, కాంగ్రెస్ ఒకటి, బీజేపీ ‘0’
ABN , First Publish Date - 2021-03-03T17:05:09+05:30 IST
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన...
న్యూఢిల్లీ: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన ఐదు వార్డుల ఉప ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఆమ్ ఆద్మీ పార్టీ అమోఘ విజయం సాధించింది. నాలుగు వార్డులను ఆమ్ ఆద్మీ పార్టీ దక్కించుకోగా, ఒక వార్డును కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఎంసీడీ ఉప ఎన్నికల ఫలితాలు బీజేపీని ఇబ్బందుల్లోకి నెట్టేశాయి.
బీజేపీ ఒక ఖాతాను కూడా తెరవలేకపోయింది. ఈరోజు ఉదయం ప్రారంభమైన ఐదు వార్డుల ఓట్ల లెక్కంపులో మొదటి నుంచి నాలుగు వార్డులలో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులు అధిపత్యంలో కొనసాగారు. షాలీమార్ బాగ్ నార్త్, కల్యాణ్పురి, త్రిలోక్పురి, రోహిణి-సీ వార్డులలో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. చౌహాన్ బాంగర్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ‘ఆప్’ విజయంతో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.