శిశోడియా ఆరోపణలను తోసిపుచ్చిన ఢిల్లీ ఎల్‌జీ

ABN , First Publish Date - 2021-07-23T00:52:07+05:30 IST

ఢిల్లీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మనీశ్ శిశోడియాdeదా

శిశోడియా ఆరోపణలను తోసిపుచ్చిన ఢిల్లీ ఎల్‌జీ

న్యూఢిల్లీ : ఢిల్లీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మనీశ్ శిశోడియా తనపై చేసిన ఆరోపణలను లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ తోసిపుచ్చారు. తాను ఉన్నతాధికారులతో భేటీ అయినట్లు శిశోడియా చేసిన ఆరోపణల్లో పస లేదన్నారు. 


తనకు భారత దేశ రాజ్యాంగం పట్ల, ప్రజాస్వామిక సూత్రాలు, సిద్ధాంతాల పట్ల సమున్నత గౌరవం ఉందని శిశోడియాకు రాసిన లేఖలో బైజాల్ తెలిపారు. అధికారాల విభజన విషయంలో సుప్రీంకోర్టు తీర్పునకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. లెఫ్టినెంట్ గవర్నర్ హోదాలో రాజ్యాంగ నిబంధనల ప్రకారమే ఇటీవల అధికారులతో సమావేశాలు నిర్వహించినట్లు వివరించారు. ఈ అంశంపై శిశోడియా స్వయంగా తనతో మాట్లాడి ఉండవలసిందన్నారు. 


శిశోడియా ఇటీవల బైజాల్‌కు రాసిన లేఖను జాతీయ మీడియా వెలుగులోకి తెచ్చింది. బైజాల్ చర్యలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాయని, ఇది సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘించడమేనని ఆరోపించారు. ఈ లేఖను బహిరంగపరచకుండా ఉండవలసిందని కూడా బైజాల్ తన లేఖలో పేర్కొన్నారు. 


Updated Date - 2021-07-23T00:52:07+05:30 IST