భార్య, ఇద్దరు కుమార్తెలను కాల్చి చంపి తానూ ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-07-16T04:36:40+05:30 IST

న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో ఘోరం జరిగింది. జఫ్రాబాద్ ప్రాంతంలో ఓ వ్యక్తి (40) తన భార్య, ఇద్దరు కుమార్తెలను కాల్చి చంపి తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

భార్య, ఇద్దరు కుమార్తెలను కాల్చి చంపి తానూ ఆత్మహత్య

న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో ఘోరం జరిగింది. జఫ్రాబాద్ ప్రాంతంలో ఓ వ్యక్తి (40) తన భార్య, ఇద్దరు కుమార్తెలను కాల్చి చంపి తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనా స్థలంలో పోలీసులకు లేఖ దొరికింది. పేదరికమే తమ ఆత్మహత్యలకు కారణమంటూ వారు రాసిన సుసైడ్ నోట్ తమకు దొరికిందని డీసీపీ సంజయ్ కుమార్ జైన్ తెలిపారు. దర్యాప్తు జరుపుతున్నామన్నారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చనిపోవడంతో జఫ్రాబాద్ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. 



Updated Date - 2022-07-16T04:36:40+05:30 IST