ఉనద్కత్ దెబ్బకు వణికిన ఢిల్లీ.. అర్ధ సెంచరీతో అదరగొట్టిన పంత్

ABN , First Publish Date - 2021-04-16T02:07:05+05:30 IST

ఐపీఎల్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ కేపిటల్స్ విలవిల్లాడుతోంది.

ఉనద్కత్ దెబ్బకు వణికిన ఢిల్లీ.. అర్ధ సెంచరీతో అదరగొట్టిన పంత్

ముంబై: ఐపీఎల్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ కేపిటల్స్ విలవిల్లాడుతోంది. ఉనద్కత్ దెబ్బకు ఢిల్లీ వికెట్లు టపటపా రాలిపోతున్నాయి. 37 వికెట్లకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఓపెనర్లు పృథ్వీషా (2), శిఖర్ ధవన్ (9), అజింక్య రహానే (8) ఉనద్కత్ దెబ్బకు పెవిలియన్ చేరారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ రిషభ్ పంత్  బౌలర్లను ఎదురొడ్డి ఆడుతున్నాడు.


ఎలాంటి తొట్రుపాటు లేకుండా నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డును పెంచుతూ పోతున్నాడు. ఈ క్రమంలో 30 బంతుల్లో 9 ఫోర్లతో అర్ధ సెంచరీ చేసి జట్టును పట్టాలెక్కించాడు. మార్కస్ స్టోయినిస్‌ను ముస్తాఫిజుర్ డకౌట్ చేశాడు. ప్రస్తుతం 12 ఓవర్లు ముగిశాయి. ఢిల్లీ నాలుగు వికెట్ల నష్టానికి 85 పరుగులు చేసింది. పంత్ (50), లలిత్ యాదవ్ (15) క్రీజులో ఉన్నారు. 

Updated Date - 2021-04-16T02:07:05+05:30 IST