కాపురానికి పనికిరాడనడం క్రూరత్వమే: కోర్టు
ABN , First Publish Date - 2020-11-22T10:03:46+05:30 IST
జీవిత భాగస్వామి నపుంసకుడు అని తప్పుడు నిందారోపణలు చేయడం క్రూరత్వమని ఢిల్లీ హైకోర్టు అభిప్రాయపడింది
న్యూఢిల్లీ, నవంబరు 21: జీవిత భాగస్వామి నపుంసకుడు అని తప్పుడు నిందారోపణలు చేయడం క్రూరత్వమని ఢిల్లీ హైకోర్టు అభిప్రాయపడింది. తీవ్ర ఆరోపణలు చేసిన భార్యతో ఇక ఎంతమాత్రం కలిసి కాపురం చేయలేనంటూ భర్త పెట్టుకున్న విడాకుల పిటిషన్ను ఇప్పటికే ట్రయిల్ కోర్టు ఆమోదించింది. దానిని సవాల్ చేస్తూ భార్య హైకోర్టును ఆశ్రయించింది.