కేజ్రీవాల్పై ట్వీట్: బీజేపీ నేత కేసు నమోదు చేయాలన్న కోర్టు
ABN , First Publish Date - 2021-11-23T22:11:00+05:30 IST
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై ట్వీట్ చేసినందుకు గాను భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రాపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఢిల్లీ కోర్టు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది...
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై ట్వీట్ చేసినందుకు గాను భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రాపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఢిల్లీ కోర్టు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. మార్ఫింగ్ చేసిన కేజ్రీవాల్ వీడియోను సంబిత్ పాత్ర ట్విట్టర్లో షేర్ చేశారు. అయితే అది తప్పుడు వీడియో అని ఆమ్ ఆద్మీ పార్టీ నిరూపించింది. అంతే కాకుండా తప్పుడు వీడియో షేర్ చేసి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసినందుకు గాను సంబిత్ పాత్రాపై చర్యలు తీసుకోవాలని ఢిల్లీ కోర్టును ఆశ్రయించింది. దీంతో వీడియోను పరిశీలించిన కోర్టు.. సంబిత్ పాత్రా ఎఫ్ఐఆర్ నమోదుకు ఢిల్లీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.