Delhiలో పెరుగుతున్న రోజువారీ కరోనా కేసులు
ABN , First Publish Date - 2022-01-04T13:47:33+05:30 IST
దేశ రాజధాని ఢిల్లీ కరోనా వైరస్ వణుకుపుట్టిస్తోంది. రోజువారీ కరోనా కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ కరోనా వైరస్ వణుకుపుట్టిస్తోంది. రోజువారీ కరోనా కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. ఢిల్లీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 4099 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవగా... ఒకరు మృతి చెందారు. అలాగే కరోనా నుంచి కోలుకుని 1,509 మంది డిశ్చార్జ్ అయ్యారు. అలాగే దేశ రాజధానిలో కోవిడ్ పాజిటివీటి రేటు 6.49 శాతంగా ఉంది. ప్రస్తుతం 10,986 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు కోవిడ్తో మృతి చెందిన వారి సంఖ్య 25,100గా నమోదు అయ్యింది.