ధరల మంటపై 12న ఢిల్లీలో కాంగ్రెస్ ర్యాలీ
ABN , First Publish Date - 2021-11-27T07:42:22+05:30 IST
ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా యావత్దేశం దృష్టిని ఆకర్షించేవిధంగా డిసెంబరు 12న ఢిల్లీలో భారీ ర్యాలీ...
న్యూఢిల్లీ, నవంబరు 26: ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా యావత్దేశం దృష్టిని ఆకర్షించేవిధంగా డిసెంబరు 12న ఢిల్లీలో భారీ ర్యాలీ(మెహంగాయ్ హటావో ర్యాలీ) నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించినట్లు ఏఐసీసీ అధికార ప్రతినిధి కేసీ వేణుగోపాల్ శుక్రవారం తెలిపారు. ర్యాలీనుద్దేశించి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఇతర ముఖ్య నేతలు ప్రసంగిస్తారన్నారు.