Delhi: జంతర్‌మంతర్‌లో Kaleswaram ముంపు బాధితుల ఆందోళన

ABN , First Publish Date - 2022-06-15T18:11:33+05:30 IST

ఢిల్లీ జంతర్ మంతర్‌లో కాళేశ్వరం ప్రాజెక్టు ముంపు గ్రామాల బాధితులు బుధవారం ఆందోళనకు దిగారు.

Delhi: జంతర్‌మంతర్‌లో Kaleswaram ముంపు బాధితుల ఆందోళన

న్యూఢిల్లీ/తెలంగాణ: ఢిల్లీ జంతర్ మంతర్‌లో కాళేశ్వరం ప్రాజెక్టు ముంపు గ్రామాల బాధితులు బుధవారం ఆందోళనకు దిగారు.  చెన్నూరు నియోజకవర్గంలోని వివిధ గ్రామాల రైతులు ఆందోళనలో పాల్గొన్నారు. బాధితుల ఆందోళనకు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి మద్దతు ఇచ్చారు. ప్రతి ఏటా కాళేశ్వరం బ్యాక్ వాటర్‌తో 15 వేల ఎకరాలకు నష్టం జరుగుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ బాధితులు నిరసన చేపట్టారు. 


ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ.... తెలంగాణ సాధించుకున్నది నీళ్లు నిధులు నియామకాల కోసమన్నారు. ఇప్పుడది మర్చిపోయి భారతీయ రాష్ట్ర సమితి అంటూ కేసీఆర్ నాటకాలాడుతున్నారని మండిపడ్డారు. కమీషన్ల కొరకు ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టారని.. కేసీఆర్ ఒక తుగ్లక్ ముఖ్యమంత్రి అంటూ వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నాలుగు సంవత్సరాలలో 40 వేల ఎకరాలకు పైగా నష్టం జరిగిందని తెలిపారు. చెన్నూరు నియోజకవర్గంలో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం న్యాయం చేయాలని వివేక్ వెంకటస్వామి డిమాండ్ చేశారు.

Updated Date - 2022-06-15T18:11:33+05:30 IST