ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్‌కు Covid positive

ABN , First Publish Date - 2022-01-04T14:09:26+05:30 IST

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు మంగళవారం ఉదయం కొవిడ్-19 పాజిటివ్ అని తేలింది....

ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్‌కు  Covid positive

న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు మంగళవారం ఉదయం కొవిడ్-19 పాజిటివ్ అని తేలింది. దీంతో తాను ఇంట్లో ఐసోలేషన్ లో ఉన్నానని సీఎం కేజ్రీవాల్ చెప్పారు.‘‘నాకు కొవిడ్‌ పాజిటివ్‌ అని తేలింది.కరోనా తేలికపాటి లక్షణాలుండటంతో ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉన్నాను. గత కొన్ని రోజులుగా నన్ను కలిసిన వారు మీరు ఐసోలేషన్‌లో ఉండండి. మీరు కరోనా పరీక్షలు చేయించుకోండి’’ అని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ఢిల్లీలో ఒమైక్రాన్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఢిల్లీలో కరోనా పాజిటివిటీ రేటు 6.46 శాతంగా ఉంది. ఢిల్లీలో 6,288 మందికి కరోనా సోకింది.సోమవారం కొవిడ్ వల్ల ఢిల్లీలో ఒకరు మరణించారు.

Updated Date - 2022-01-04T14:09:26+05:30 IST