ఢిల్లీలో టీఆర్ఎస్, బీజేపీ పోటాపోటీ ఫ్లెక్సీలు
ABN , First Publish Date - 2022-04-11T16:53:32+05:30 IST
దేశరాజధాని ఢిల్లీలో టీఆర్ఎస్, బీజేపీ నేతలు పోటాపోటీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో టీఆర్ఎస్, బీజేపీ నేతలు పోటాపోటీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. తెలంగాణ భవన్ దగ్గర తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పేరుతో బీజేపీ ఫ్లెక్సీలు వెలిశాయి. గల్లీ రాజకీయాలు ఢిల్లీలో చేస్తావా.. రైతుల పేరుతో నాటకాలు అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. చేతనైతే ధాన్యం కొను.. లేదంటే గద్దె దిగు పేరుతో బీజేపీ ఫ్లెక్సీ ఏర్పాటు చేసింది. మరోవైపు దీక్ష పేరుతో టీఆర్ఎస్ నేతలు భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. 3 భాషల్లో బీజేపీ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కాగా బీజేపీ ఫ్లెక్సీలను టీఆర్ఎస్ కార్యకర్తలు చించివేస్తున్నారు.