స్వల్ప స్కోరుకే పంజాబ్ ఆలౌట్.. ఢిల్లీ ముందు సునాయాస లక్ష్యం

ABN , First Publish Date - 2022-04-21T02:52:30+05:30 IST

ముంబై : ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లు మరోమారు సత్తాచాటారు. బౌలర్లు సమష్టగా తలోచెయ్యి వేసి పంజాబ్ కింగ్స్ బ్యాట్స్‌మెన్లను స్వల్ప స్కోరుకే నిలువరించారు.

స్వల్ప స్కోరుకే పంజాబ్ ఆలౌట్.. ఢిల్లీ ముందు సునాయాస లక్ష్యం

ముంబై : ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లు మరోమారు సత్తాచాటారు. బౌలర్లు సమష్టగా తలోచెయ్యి వేసి పంజాబ్ కింగ్స్ బ్యాట్స్‌మెన్లను స్వల్ప స్కోరుకే నిలువరించారు. నిర్ణీత 20 ఓవర్లలో 115 పరుగులకే పంజాబ్ కింగ్స్ ఆలౌట్ అయ్యింది. ఖలీల్ అహ్మద్ 2 వికెట్లు, లలిత్ యాదవ్ (2), ముస్తాఫిజుర్ రహ్మన్ (1), అక్షర్ పటేల్(2), కుల్దీప్ యాదవ్(2) చొప్పున వికెట్లు తీశారు. రనౌట్ రూపంలో మరో వికెట్ లభించింది. ఇక పంజాబ్ కింగ్స్ బ్యాట్స్‌మెన్ ఈ మ్యాచ్‌లో తేలిపోయారు.  కేవలం నలుగురు మాత్రమే రెండంకెల స్కోర్ చేయగలిగారు. మయాంక్ అగర్వాల్(24), శిఖర్ ధవన్(9), జానీ బెయిర్‌స్ట్రో(9), లియామ్ లివింగ్‌స్టోన్(2), జితేష్ శర్మ(32), షారుక్ ఖాన్(12), కగిసో రబడా(0), నాథన్ ఎల్లీస్(0), రాహుల్ చహార్(12), అర్షదీప్ సింగ్(9), వైభవ్ అరోరా(2 నాటౌట్) పరుగులు చేశారు. కాగా ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ పంజాబ్ కింగ్స్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.

Updated Date - 2022-04-21T02:52:30+05:30 IST