ఆసుప‌త్రి నుంచి ప‌రారైన క‌రోనా బాధితులు ఎక్క‌డికెళ్లారంటే...

ABN , First Publish Date - 2021-05-11T15:19:39+05:30 IST

ఉత్తర ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ ఆధ్వ‌ర్యంలోని...

ఆసుప‌త్రి నుంచి ప‌రారైన క‌రోనా బాధితులు ఎక్క‌డికెళ్లారంటే...

న్యూఢిల్లీ: ఉత్తర ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ ఆధ్వ‌ర్యంలోని హిందూరావ్‌ ఆసుపత్రి నుంచి ప‌రారైన 23 మంది కరోనా బాధితుల ఆచూకీ తెలిసింది. వీరంతా ఇతర ఆసుప‌త్రుల‌లో లేదా హోమ్ క్వారంటైన్‌లో ఉన్నార‌ని ఆసుప‌త్రివ‌ర్గాలు అధికారికంగా ప్ర‌క‌టించాయి. అయితే అంత‌కుమందు ఉత్తర ఢిల్లీ మేయర్ జయప్రకాష్...  హిందూరావ్‌ ఆసుపత్రి నుంచి 23 మంది కోవిడ్ బాధితులు ప‌రార‌య్యార‌ని ప్ర‌కటించారు. అయితే దీనిలో వాస్త‌వం లేద‌ని ఆ 23 మంది బాధితుల‌లో 19 మందిని అత్య‌వ‌స‌ర‌మై ఇత‌ర ఆసుప‌త్రుల‌కు త‌ర‌లించామ‌ని ఆసుప‌త్రి అధికారులు తెలిపారు. మిగిలిన న‌లుగురు డిశ్చార్జ్ అయ్యార‌న్నారు. ఈ విష‌యం తెలియ‌క మేయ‌ర్  త‌ప్పుడు ప్ర‌క‌ట‌న చేశార‌న‌న్నారు. కాగా ఈ ఘ‌ట‌న‌పై  విచార‌ణ‌కు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అధికారుల‌కు ఆదేశాలు జారీ చేశారు.



Updated Date - 2021-05-11T15:19:39+05:30 IST