శ్రీరామాద్వైతం!
ABN , First Publish Date - 2020-06-26T05:30:00+05:30 IST
అధ్యాపకత్వాన్ని వృత్తిగా, ఆధ్యాత్మికతను ప్రవృత్తిగా స్వీకరించిన విశిష్టాద్వైత మార్గానుశీలి తిరుకోవలూరు రామానుజస్వామి. భగవత్సంబంధమైన గ్రంథాల లోతులను పరిశీలించిన ఆయన పలు రచనలు చేశారు...
అధ్యాపకత్వాన్ని వృత్తిగా, ఆధ్యాత్మికతను ప్రవృత్తిగా స్వీకరించిన విశిష్టాద్వైత మార్గానుశీలి తిరుకోవలూరు రామానుజస్వామి. భగవత్సంబంధమైన గ్రంథాల లోతులను పరిశీలించిన ఆయన పలు రచనలు చేశారు. వాటిలో ఒకటైన ‘శ్రీరామ శతకము’ 36 ఏళ్ళ కిందట తొలిసారి ప్రచురితం అయింది. 2008లో దివంగతులైన రామానుజస్వామి శతజయంతి (2019) సందర్భంగా ఆ శతకాన్ని ఆయన రాసిన మరికొన్ని రచనలు పునర్ముద్రణకు నోచుకున్నాయి. దీనితోపాటు ‘శ్రీరామ శతకము’లో ప్రస్ఫుటమయ్యే విశిష్టాద్వైత విశేషాలను విశ్లేషించే వ్యాసాలతో, శ్రీరామానుజస్వామి సన్నిహితుల జ్ఞాపకాలతో రూపొందిన మరో పుస్తకాన్ని ఆయన కుమారుడు టి.శ్రీరంగస్వామి సంపాదకత్వంలో వెలువరించారు. ఈ పుస్తకాలు ఆధ్యాత్మిక చింతన కలిగిన పాఠకులను ఆకట్టుకుంటాయి.
శ్రీరామ శతకము (ఇతర సమగ్ర రచనలు) తిరుకోవలూరు రామానుజస్వామి
పేజీలు: 96, వెల: రూ. 50
శ్రీరామశతకము-విశిష్టాద్వైత సౌరభం
సంపాదకత్వం: డాక్టర్ టి. శ్రీరంగస్వామి
పేజీలు: 232, వెల: రూ. 150
ప్రచురణ: శ్రీలేఖ సాహితి, వరంగల్లు
ప్రతులకు: 99498 57955