ప్రశాంతంగా ముగిసిన డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు
ABN , First Publish Date - 2020-10-24T11:28:39+05:30 IST
విక్రమ సింహపురి యూనివర్సిటీ ( వీఎస్యూ ) పరిధిలోని అనుబంధ డిగ్రీ కళాశాలలో డిగ్రీ మొదటి, రెండో ఏడాది..
వెంకటాచలం, అక్టోబరు 23 : విక్రమ సింహపురి యూనివర్సిటీ ( వీఎస్యూ ) పరిధిలోని అనుబంధ డిగ్రీ కళాశాలలో డిగ్రీ మొదటి, రెండో ఏడాది విద్యార్థులకు 14వ తేదీ నుంచి ప్రారంభమైన డిగ్రీ రెండో, నాల్గవ సెమిస్టర్ పరీక్షలు శుక్రవారంతో ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం జరిగిన నాల్గవ సెమిస్టర్ పరీక్షలకు 656 మంది విద్యార్థులకు గానూ 581 మంది హాజరు కాగా, మిగిలిన 75 మంది గైర్హాజరయ్యారు. అలాగే మధ్యాహ్నం జరిగిన రెండో సెమిస్టర్ పరీక్షలకు 1,796 మంది విద్యార్థులకు గానూ 1,527 మంది హాజరు కాగా మిగిలిన 269 మంది గైర్హాజరైనట్లు వీఎస్యూ పరీక్షల నిర్వాహణాధికారి డాక్టర్ సీఎస్. సాయిప్రసాద్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.