డిగ్రీ సీట్లు కూడా అమ్ముకుంటారా?: శైలజానాథ్
ABN , First Publish Date - 2021-10-10T00:47:42+05:30 IST
డిగ్రీ సీట్లు కూడా అమ్ముకుంటారా? అని పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ ప్రశ్నించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పేద విద్యార్థులకు
అమరావతి: డిగ్రీ సీట్లు కూడా అమ్ముకుంటారా? అని పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ ప్రశ్నించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పేద విద్యార్థులకు తీరని అన్యాయం చేస్తున్నారని దుయ్యబట్టారు. విద్యను వ్యాపారం చేయడం తగదని హితవుపలికారు. డిగ్రీ కళాశాలల్లో 30 శాతం సీట్లు అమ్ముకునేందుకు అనుమతిస్తూ.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం శోచనీయమన్నారు. ఫీజు రీయిబర్స్మెంట్ ఇవ్వకుండా తప్పించుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని శైలజానాథ్ తప్పుబట్టారు.