డిగ్రీ పరీక్ష వాయిదా వేయాలి: ఎస్‌ఎఫ్‌ఐ

ABN , First Publish Date - 2022-07-07T04:21:51+05:30 IST

ఈ నెల 13న జరగబోయే డిగ్రీ చివరి సె మిస్టర్‌ పరీక్షను వాయిదా వేయాలని ఎస్‌ఎ్‌ఫఐ జి ల్లా అధ్యక్షుడు నాయక్‌ డిమాండ్‌ చేశారు.

డిగ్రీ పరీక్ష వాయిదా వేయాలి: ఎస్‌ఎఫ్‌ఐ
వినతిపత్రం సమర్పిస్తున్న ఎస్‌ఎ్‌ఫఐ నాయకులు

కడప(వైవీయూ),  జూలై 6 : ఈ నెల 13న జరగబోయే డిగ్రీ చివరి సె మిస్టర్‌ పరీక్షను వాయిదా వేయాలని ఎస్‌ఎ్‌ఫఐ జి ల్లా అధ్యక్షుడు నాయక్‌ డిమాండ్‌ చేశారు.  యోగి వేమన యూనివర్సిటీలో బుధవారం పరీక్షల విభా గం అధికారి ఆచార్య ఈశ్వరరెడ్డికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 13న ఆంధ్రప్రదేశ రాష్ట్ర న్యాయ విద్య ప్రవేశ పరీక్ష, యోగి వేమన యూనివర్శిటీ అనుబంధ డిగ్రీ కళాశాలల్లో డిగ్రీ చివరి సెమిస్టర్‌ పరీక్షఒకే రోజు ఉండడంతో ఏ పరీక్ష రాయాలో తెలియక విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారన్నారు. కావున 13న జరిగే డిగ్రీ చివరి సెమిస్టర్‌ పరీక్షను వాయిదా వేసి విద్యార్థులకు రెండు పరీక్షలు రాయడానికి వీలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎ్‌ఫఐ వైవీయూ కార్యదర్శి ప్రతాప్‌, నాయకులు మహేష్‌, గణేష్‌,  రఘు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-07-07T04:21:51+05:30 IST