‘నేటి నుంచి డిగ్రీ కళాశాలల్లో అడ్మిషన్లు’

ABN , First Publish Date - 2021-01-24T05:30:00+05:30 IST

డిగ్రీ ప్రవేశాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు సోమవారం నుంచి ఈ నెల 27వ తేదీ వరకు అడ్మిషన్లు ఇవ్వనున్నట్లు కేవీఆర్‌ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ ఇందిరాశాంతి తెలిపారు.

‘నేటి నుంచి డిగ్రీ కళాశాలల్లో అడ్మిషన్లు’

కర్నూలు(అర్బన్‌), జనవరి 24: డిగ్రీ ప్రవేశాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు సోమవారం నుంచి ఈ నెల 27వ తేదీ వరకు అడ్మిషన్లు ఇవ్వనున్నట్లు కేవీఆర్‌ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ ఇందిరాశాంతి తెలిపారు. జిల్లాలోని 64 డిగ్రీ కళాశాలల్లో  ప్రవేశాలకు ఆన్‌లైన్‌లో ఎంపిక చేసుకునే ప్రక్రియ ఈ నెల 21వ తేదీన ప్రారంభించగా  24వ తేదీతో ముగిసిందని ఆమె వెల్లడించారు. వెబ్‌ ఆప్షన్ల ద్వారా దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు సోమవారం నుంచి ప్రవేశాలు కల్పిస్తామని ఆమె పేర్కొన్నారు. 

Updated Date - 2021-01-24T05:30:00+05:30 IST