డిజిటల్‌ చెల్లింపులే మేలు: ఆర్‌బీఐ

ABN , First Publish Date - 2020-04-10T06:46:48+05:30 IST

కరోనా వైరస్‌ నేపథ్యంలో డిజిటల్‌ చెల్లింపులే మేలని ఆర్‌బీఐ బ్యాంకుల ఖాతాదారులకు సూచించింది. అన్ని రకాల చెల్లింపుల కోసం..

డిజిటల్‌ చెల్లింపులే మేలు: ఆర్‌బీఐ

ముంబై: కరోనా వైరస్‌ నేపథ్యంలో డిజిటల్‌ చెల్లింపులే మేలని ఆర్‌బీఐ బ్యాంకుల ఖాతాదారులకు సూచించింది. అన్ని రకాల చెల్లింపుల కోసం 24 గంటలూ అందుబాటులో ఉండే నెఫ్ట్‌, ఐఎంపీఎస్‌, యూపీఐ, బీబీపీఎ్‌సవంటి డిజిటల్‌ చెల్లింపుల సౌలభ్యాన్ని ఉపయోగించుకోవాలని కోరింది. ఈ తరహా చెల్లింపులతో బ్యాంకులకు వెళ్లనవసరం లేకుండానే ఆర్థిక లావాదేవీలు ముగించుకోవడంతో పాటు సామాజిక దూరం పాటించినట్టవుతుందని పేర్కొంది. ఈ మేరకు బాలీవుడ్‌ బాద్‌షా అమితాబ్‌ బచ్చన్‌ ద్వారా ప్రచారం ప్రారంభించింది. ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ కూడా ఇటీవల ఒక వీడియోలో ‘పే డిజిటల్‌. స్టే సేఫ్‌’ అని సందేశం ఇచ్చారు. 

Updated Date - 2020-04-10T06:46:48+05:30 IST