భారత్‌ బోణీ

ABN , First Publish Date - 2022-01-22T09:19:53+05:30 IST

ఆసియా కప్‌ మహిళల హాకీలో డిఫెండింగ్‌ చాంప్‌ భారత్‌ ఘనంగా బోణీ చేసింది.

భారత్‌ బోణీ

9-0తో మలేసియాపై ఘన విజయం

ఆసియాకప్‌ హాకీ

మస్కట్‌: ఆసియా కప్‌ మహిళల హాకీలో డిఫెండింగ్‌ చాంప్‌ భారత్‌ ఘనంగా బో ణీ చేసింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 9-0తో మలేసియాను చిత్తు చేసింది. 250వ మ్యాచ్‌ ఆడుతున్న వందనా కటారియా (8, 34వ నిమిషాలు) శుభారంభం చే యగా.. నవ్‌నీత్‌ (15వ, 27వ), షర్మిల (46వ, 59వ) డబుల్‌ గోల్స్‌తో అదరగొట్టారు. దీప్‌ గ్రేస్‌ (10వ), నేహా (34వ) లాల్‌రిమ్సియామి (38వ), మోనిక (40వ) తలో గోల్‌ చేశారు. 

Updated Date - 2022-01-22T09:19:53+05:30 IST