నిందితులను కఠినంగా శిక్షించాలి

ABN , First Publish Date - 2021-03-02T06:48:23+05:30 IST

హైకోర్టు న్యాయవాది వామన్‌రావు దంపతులను హత్యచేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని బార్‌ అసోసియేషన్‌ నాయకులు కాల్వ శ్రీనివా్‌సనాయుడు, ప్రవీణ్‌, రమాదేవి డిమాండ్‌ చేశారు.

నిందితులను కఠినంగా శిక్షించాలి
హుజూర్‌నగర్‌లో విధులను బహిష్కరించి ఆందోళనచేస్తున్న న్యాయవాదులు

విధులను బహిష్కరించిన న్యాయవాదులు

హుజూర్‌నగర్‌, సూర్యాపేటలీగల్‌, మార్చి 1: హైకోర్టు న్యాయవాది వామన్‌రావు దంపతులను హత్యచేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని బార్‌ అసోసియేషన్‌ నాయకులు కాల్వ శ్రీనివా్‌సనాయుడు, ప్రవీణ్‌, రమాదేవి డిమాండ్‌ చేశారు. న్యాయవాదుల రక్షణకు చట్టం తీసుకరావాలని, వామనరావు దంపతుల హత్య కేసును సీబీఐకి అప్పగించాలనే డిమాండ్‌తో న్యాయవాదులు సోమవారం విధులను బహిష్కరించి జిల్లావ్యాప్తంగా కోర్టుల ఎదుట ధర్నా చేశారు. కార్యక్రమంలో నాగార్జున, సత్యనారాయణ, యాదగిరి, అంజయ్య, సురేష్‌, నర్సింహారావు, కంచర్ల సతీ్‌షకుమార్‌, జటంగి వెంకటేశ్వర్లు, వసంత సత్యనారాయణపిల్లే, నూకల సుదర్శన్‌రెడ్డి, జె.శశిధర్‌, శంకరయ్య, శ్రవణ్‌కుమార్‌, అయోధ్య, లక్ష్మికాంతరావు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-02T06:48:23+05:30 IST