ముగ్గురికి నిప్పంటించిన కేసులో నిందితుల అరెస్టు
ABN , First Publish Date - 2022-06-27T04:49:23+05:30 IST
ఆస్థి కోసం నిద్రిస్తున్న రమావత్ స్వామినాయక్, రెండో భార్య గంగు, కుమారుడు గౌతమ్పై పెట్రోల్ పోసి మొదటి భార్య రమావత్ లక్ష్మీబాయి మరికొందరితో కలిసి హత్యకు యత్నించిందని రైల్వేకోడూరు సీఐ కె. విశ్వనాథరెడ్డి వివ రించారు.
రైల్వేకోడూరు, జూన్ 26: ఆస్థి కోసం నిద్రిస్తున్న రమావత్ స్వామినాయక్, రెండో భార్య గంగు, కుమారుడు గౌతమ్పై పెట్రోల్ పోసి మొదటి భార్య రమావత్ లక్ష్మీబాయి మరికొందరితో కలిసి హత్యకు యత్నించిందని రైల్వేకోడూరు సీఐ కె. విశ్వనాథరెడ్డి వివ రించారు. పోలీసులు అందించిన వివరాల్లోకెళితే... స్థానిక రంగనాయకులపేట వాసులు స్వామినాయక్, రెండో భార్య, కుమారుడుతో నిద్రిస్తుండగా మొదటి భార్యతో పెట్రోల్ పోసి నిప్పుంటించారు. దీంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. బంధువులు, పోలీసులు క్షతగాత్రులను తిరుపతిలోని ఓ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ముగు ్గరూ మృతి చెందారు.
ఈకేసులో నిందితులు రమావత్లక్ష్మీబాయి, బనావత్ రామక్క, గోవిందు వెంకటేశు అలియాస్ దాసర్ల వెంకటేశును సీఐ రాఘవరాజపురం వద్ద అరెస్టు చేసి రైల్వేకోడూరు కోర్టులో హజరుపరిచారు. నిందితులకు కోర్టు రిమాండ్ విధించినట్లు వివరించారు. ముగ్గురూ చనిపోతే ఆస్తి మొత్తం తనకు వస్తుందని ప్లాన్ చేసిందన్నారు. మొత్తం సీన్ అంతా రివర్స్ కావడంతో జైలుపాలైనట్లు ఆయన వివరించారు.