అత్యాచారం కేసులో నిందితుడి అరెస్ట్‌

ABN , First Publish Date - 2021-04-17T05:51:11+05:30 IST

మండల పరిధిలోని పట్నం గ్రామంలో బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో నిందితుడిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ భవ్యకిశోర్‌ పేర్కొన్నారు.

అత్యాచారం కేసులో నిందితుడి అరెస్ట్‌
అరెస్టు వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ భవ్యకిశోర్‌

కదిరిఅర్బన, ఏప్రిల్‌ 16: మండల పరిధిలోని పట్నం గ్రామంలో బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో నిందితుడిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ భవ్యకిశోర్‌ పేర్కొన్నారు. శుక్రవారం పట్నం పోలీసుస్టేషనలో అరెస్టు వివరాలను నల్లమాడ సీఐ ఇస్మాయిల్‌, ఎస్‌ఐ నాగేష్‌బాబుతో కలిసి డీఎస్పీ వెల్లడించారు. పట్నం గ్రామానికి చెందిన రామక్రిష్ణ స్థానిక ప్రభుత్వ పాఠశాల వద్ద తోపుడు బండిపై తినుబండారాలు పెట్టుకుని అమ్ముతూ జీవనం సాగించేవాడు. ఈ క్రమంలో ఈ నెల 14న రాత్రి 7.30 గంటల సమయంలో తన స్నేహితురాలి ఇంటికి వెళ్తున్న బాలికను పాఠశాలలోపలికి తీసుకెళ్ళి అత్యాచారం చేస్తుండగా బాలిక గట్టిగా అరవ డంతో అటుగా వెళ్తున్న కొందరు యువకులు బాలికను రక్షించారు. ఈ సం ఘటన పై బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పట్నం పోలీసుస్టేషనలో కేసు నమోదు చేశామ న్నారు. నిందితుడి అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ తెలి పారు. గతంలో ఇతని ప్రవర్తనపై పాఠశాల ప్రధానోపాధ్యాయురాలికి కొందరు విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో, స్కూలు పరిసరాలలో వ్యాపారం చేయకూడ దని అతన్ని మందలించడం జరిగిందన్నారు.


Updated Date - 2021-04-17T05:51:11+05:30 IST