చిట్టీల పేరుతో చీటింగ్‌

ABN , First Publish Date - 2020-09-25T07:22:14+05:30 IST

చిట్టీల పేరుతో మోసానికి పాల్పడిన వ్యక్తిని సీసీఎస్‌ పోలీసులు అరెస్టు చేశారు. నగరానికి చెందిన కంచం కిరణ్‌కుమార్‌

చిట్టీల పేరుతో చీటింగ్‌

బెంగళూరులో నిందితుడి అరెస్ట్‌ 


హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబర్‌ 24(ఆంధ్రజ్యోతి): చిట్టీల పేరుతో మోసానికి పాల్పడిన వ్యక్తిని సీసీఎస్‌ పోలీసులు అరెస్టు చేశారు. నగరానికి చెందిన కంచం కిరణ్‌కుమార్‌ వ్యాపారంతోపాటు అనధికారికంగా చిట్టీలు నిర్వహించేవాడు. చిట్టీలు వేసిన వారికి అదే డబ్బు వ్యాపారంలో పెట్టుబడిగా పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మించాడు. పలువురి నుంచి డబ్బులు సేకరించిన కిరణ్‌ తన ఇంటిని అమ్మి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. మోసపోయామంటూ కొందరు మార్చిలో సీసీఎస్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నగరం నుంచి పరారైన కిరణ్‌ బెంగళూరులో తల దాచుకున్నాడనే సమాచారం మేరకు పోలీసులకు బెంగళూరు వెళ్లి అతడిని అరెస్ట్‌ చేశారు. గురువారం నగరానికి తీసుకొచ్చి కోర్టులో హాజరుపరిచారు. 

Updated Date - 2020-09-25T07:22:14+05:30 IST