పాక్‌ చేతిలో పోరాడి ఓడిన జింబాబ్వే

ABN , First Publish Date - 2020-10-31T10:16:04+05:30 IST

జింబాబ్వేతో మూడు వన్డేల సిరీ్‌సలో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో ఆతిథ్య పాకిస్థాన్‌ గెలుపొందింది. తొలుత హరీస్‌ సోహైల్‌

పాక్‌ చేతిలో పోరాడి ఓడిన జింబాబ్వే

రావల్పిండి: జింబాబ్వేతో మూడు వన్డేల సిరీ్‌సలో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో ఆతిథ్య పాకిస్థాన్‌ గెలుపొందింది. తొలుత హరీస్‌ సోహైల్‌ (71), ఇమామ్‌ ఉల్‌ హక్‌ (58) అర్ధ సెంచరీలతో రాణించడంతో పాక్‌ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 281 పరుగులు చేసింది. ఛేదనలో జింబాబ్వే 115/4తో పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ బ్రెండన్‌ టేలర్‌ (112) సెంచరీ, వెస్లీ మధెవెరె (55) అర్ధ సెంచరీలతో చెలరేగడంతో జింబాబ్వే 45 ఓవర్లలో 234/4తో గెలుపు దిశగా సాగింది. కానీ, షహీన్‌ షా అఫ్రీది (5/49), వాహబ్‌ రియాజ్‌ (4/41) దెబ్బకు చివరి 5 ఓవర్లలో ఏకంగా 6 వికెట్లు కోల్పోయి ఓటమి పాలైంది. 

Updated Date - 2020-10-31T10:16:04+05:30 IST