టీఆర్‌ఎస్‌, బీజేపీలను ఓడించండి

ABN , First Publish Date - 2022-08-17T05:49:43+05:30 IST

మునుగోడు ఉప ఎన్నికల్లో డబ్బుసంచులతో ఎన్నికల్లో పాల్గొనే టీఆర్‌ఎస్‌, బీజేపీలను ఓడించి ప్రజా సమస్యల కోసం పాటుపడే కాంగ్రెస్‌ పార్టీని గెలిపించాలని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర నాయకుడు గండ్ర సత్యనారాయణరావు కోరారు.

టీఆర్‌ఎస్‌, బీజేపీలను ఓడించండి


పీసీసీ నాయకుడు గండ్ర సత్యనారాయణరావు

సంస్థాన నారాయణపురం, ఆగస్టు 16: మునుగోడు ఉప ఎన్నికల్లో  డబ్బుసంచులతో ఎన్నికల్లో పాల్గొనే టీఆర్‌ఎస్‌, బీజేపీలను ఓడించి ప్రజా సమస్యల కోసం పాటుపడే కాంగ్రెస్‌ పార్టీని గెలిపించాలని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర నాయకుడు గండ్ర సత్యనారాయణరావు కోరారు. సంస్థాన నారాయణపురం మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం ఆయన పర్యటించారు. పలు గిరిజన తండాలను సందర్శించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మండల కేంద్రంలో  కాంగ్రెస్‌ పార్టీ సమావేశం జరిగింది. ఈనెల 19న జరిగే మండల పార్టీ సన్నాహక సమావేశానికి సంబందించి సమావేశంలో చర్చించారు. ఈసందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో సత్యనారాయణ మాట్లాడుతూ మునుగోడు అభివృద్ధి కోసం పార్టీమారానని చెప్పుకుంటున్న రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరితే ఏం అభివృద్ధి చేస్తారని ప్రశ్నించారు.  సమావేశంలో జిల్లా కాంగ్రెస్‌ నాయకులు గడ్డం మురళిధర్‌రెడ్డి, రాసమల్ల యాదయ్య, మందుగుల బాలకృష్ణ, కరంటోతు బిక్షపతినాయక్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-08-17T05:49:43+05:30 IST