ప్రగతి భవన్‌ ముట్టడిని జయప్రదం చేయండి

ABN , First Publish Date - 2022-05-19T05:03:15+05:30 IST

విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 23న చేపట్టిన చలో ప్రగతి భవన్‌ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు రెడ్డి చరణ్‌ కోరారు.

ప్రగతి భవన్‌ ముట్టడిని జయప్రదం చేయండి
పోస్టర్లను ఆవిష్కరిస్తున్న పీడీఎస్‌యూ నాయకులు

- పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు రెడ్డి చరణ్‌

బెల్లంపల్లి, మే 18 : విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 23న చేపట్టిన చలో ప్రగతి భవన్‌ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు రెడ్డి చరణ్‌ కోరారు. బుధవారం పట్టణంలోని ఆశ్రమ పాఠశాలలో చలో ప్రగతి భవన్‌ పోస్టర్లను ఆవిష్కరించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగులు ఉంటే రాష్ట్ర ప్రభుత్వం 91 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్‌లకు మాత్రమే ప్రకటన చేయడం సరైంది కాదన్నారు. కాంట్రాక్టు వ్యవస్థ లేకుండా చేస్తానని చెప్పిన సీఎం కేసీఆర్‌ కాంట్రాక్టు కార్మికులను ఇప్పటి వరకు పర్మినెంటు చేయాలన్నారు. కేజీ టూ పీజీ ఉచిత విద్య ఊసే లేదన్నారు. పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు, ఫీజురీయింబర్స్‌మెంట్‌ విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.  కార్యక్రమంలో నాయకులు మనోహర్‌, సిద్ధార్ధ, సాయి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-19T05:03:15+05:30 IST