గుణేశ్వరన్ ఓటమి
ABN , First Publish Date - 2021-09-18T07:48:02+05:30 IST
ఫిన్లాండ్తో డేవి్సకప్ వర ల్డ్ గ్రూప్ తొలి రౌండ్ను భారత్ ఓటమితో ఆరంభించింది.
డేవిస్ కప్
ఎస్పో: ఫిన్లాండ్తో డేవి్సకప్ వర ల్డ్ గ్రూప్ తొలి రౌండ్ను భారత్ ఓటమితో ఆరంభించింది. ఆరంభ మ్యాచ్లో తనకంటే తక్కువ ర్యాం కర్ చేతిలో ప్రజ్ఞేష్ గుణేశ్వరన్ పరాజయం పాలయ్యాడు. శుక్రవారం జరిగిన తొలి సింగిల్స్ మ్యాచ్లో ప్రజ్ఞేష్ గుణేశ్వరన్ 3-6, 6-7(1)తో ఒటో విర్టానెన్ చేతిలో పోరాడి ఓడాడు. మొదటి సెట్ను విర్టానెన్ సునాయాసంగా నెగ్గినా.. రెండో సెట్లో గుణేశ్వరన్ గట్టిపోటీ ఇచ్చాడు. అయితే, ట్రైబేక్లో మాత్రం ప్రత్యర్థికి తలవంచాడు. ఏటీపీ ర్యాంకింగ్స్లో గుణేశ్వరన్ 165, విర్టానెన్ 419వ ర్యాంకుల్లో ఉన్నారు.