నీటి కోసం ఇంట్లోకొచ్చిన జింక

ABN , First Publish Date - 2022-05-08T16:04:40+05:30 IST

తాగునీటి కోసం ఇంట్లోకొచ్చిన జింకను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తిరువణ్ణామలై అరుణాచలేశ్వరస్వామి ఆలయం వెనుక భాగంలోని కొండ ప్రాంతాల్లో

నీటి కోసం ఇంట్లోకొచ్చిన జింక

పెరంబూర్‌(చెన్నై): తాగునీటి కోసం ఇంట్లోకొచ్చిన జింకను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తిరువణ్ణామలై అరుణాచలేశ్వరస్వామి ఆలయం వెనుక భాగంలోని కొండ ప్రాంతాల్లో అధికసంఖ్యలో జింకలున్నాయి. కొద్దికాలంగా ఎండ తీవ్రతతో కొండ ప్రాంతాల్లో నీటి ఎద్దడి నెలకొనడంతో జంతువులు సమీపంలోని జనావాస ప్రాంతాలకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో, తిరువణ్ణామలై కొండ దిగువన ఉన్న పుదువానియంకుళం వీధిలోని ఓ ఇంటికి శనివారం ఉదయం ఓ జింక వచ్చింది. ఆ సమయంలో వీధికుక్కల దాడిలో జింకకు స్వల్పగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న అటవీ సిబ్బంది అక్కడికి చేరుకొని జింకను స్వాధీనం చేసుకొని చికిత్సలు అందించి మళ్లీ అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు.

Read more