తాలిబన్ల చేతిలో అఫ్ఘానిస్థాన్.. చాలా ఆందోళనగా ఉంది: మలాలా యూసష్ జాయ్

ABN , First Publish Date - 2021-08-16T01:25:05+05:30 IST

యావత్ అఫ్ఘానిస్థాన్ తాలిబన్ల వయసమైన నేపథ్యంలో అక్కడి మహిళల భవిష్యత్తుపై విద్యాహక్కుల కార్యకర్త మలాలా యూసఫ్జాయ్ ఆందోళన వ్యక్తం చేశారు.

తాలిబన్ల చేతిలో అఫ్ఘానిస్థాన్..  చాలా ఆందోళనగా ఉంది: మలాలా యూసష్ జాయ్

న్యూఢిల్లీ: యావత్ అఫ్ఘానిస్థాన్ తాలిబన్ల వయసమైన నేపథ్యంలో అక్కడి మహిళల భవిష్యత్తుపై విద్యాహక్కుల కార్యకర్త మలాలా యూసష్ జాయ్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘అక్కడి మహిళలు, మైనారిటీలు, మానవహక్కుల కార్యకర్తల విషయంలో నేను తీవ్రంగా ఆందోళన చెందుతున్నా. అఫ్ఘానిస్థాన్‌ తాలిబన్ల చేతిలోకి వెళ్లడం చూసి షాకైపోయా’’ అని ఆమె కామెంట్ చేశారు.  తాలిబన్ ప్రతినిధి ఎహ్‌షానుల్లా ఎహ్సాన్ 2012లో మలాలాపై కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. బాలికల విద్యాహక్కు కోసం పోరాడుతున్న ఆమెకు గుణపాఠం నేర్పించేందుకు నిందితుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. అదృష్టవశాత్తూ..ఈ ఘటన నుంచి పూర్తిగా కోలుకున్న ఆమె ప్రస్తుతం మహిళల విద్యాహక్కు కోసం ఉద్యమిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె నోబెల్ బహుమతి కూడా గెలుచుకున్నారు. 

Updated Date - 2021-08-16T01:25:05+05:30 IST