పోలవరపు చంద్రబాబుకు టీడీపీ అధినేత నివాళి
ABN , First Publish Date - 2020-11-30T06:17:52+05:30 IST
పోలవరపు చంద్రబాబుకు టీడీపీ అధినేత నివాళి
విద్యాధరపురం, నవంబరు 29 : తెలుగు యువత కార్యదర్శి పోలవరపు చంద్రబాబుకు టీడీపీ అధినేత చంద్రబాబు నివాళి అర్పించారు. పోలవరపు చంద్రబాబు ఇటీవల అనారోగ్యంతో మృతిచెందారు. దీంతో అమరావతిలోని నివాసంలో ఆదివారం ఆయన చిత్రపటానికి చంద్రబాబు పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.