ఘనంగా దీక్షా దివస్‌

ABN , First Publish Date - 2020-11-30T05:23:10+05:30 IST

ఘనంగా దీక్షా దివస్‌

ఘనంగా దీక్షా దివస్‌
కడ్తాలలో కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న నాయకులు

కడ్తాల్‌/ఆమనగల్లు : తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆమరణ దీక్ష చేసి 11 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మండల కేంద్రంలో ఆదివారం దీక్షా దివస్‌ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కేటీఆర్‌ సేవా సమితి జిల్లా అధ్యక్షుడు కే.చందోజీ, ఉప సర్పంచ్‌ కడారి రామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. దీక్షా దివస్‌ స్ఫూర్తితో తెలంగాణ ప్రగతికి పునరంకితమైన కేసీఆర్‌కు ప్రజలంతా అండగా నిలవాలన్నారు. కార్యక్రమంలో నాయకులు ఈర్ష్యద్‌, సీహెచ్‌ మహేశ్‌, తిరుమలేశ్‌, రామచంద్రయ్య, కల్యాణ్‌కార్‌ చందోజీ. బోసు వెంకటేశ్‌, కూకుట్ల శ్రీను, తదితరులు పాల్గొన్నారు. ఆమనగల్లు మండల పరిధి మేడిగడ్డతండాలో దీక్షా దివస్‌ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. టీఆర్‌ఎస్‌ యువజన విభాగం జిల్లా నాయకుడు విజయ్‌రాథోడ్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎంపీపీ అనితవిజయ్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో రూప్లీ, సీవీ, సోమ్లీ, కవిత, సక్రి, జంబ్లీ, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-30T05:23:10+05:30 IST