డీఎడ్ స్పాడ్ అడ్మిషన్లు నిర్వహించాలి
ABN , First Publish Date - 2021-04-13T06:14:37+05:30 IST
జిల్లాలో 2018-2020 డీఎడ్ మేనేజ్మెంట్ అండ్ స్పాట్ అడ్మిషన్ల విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలని కోరుతూ సోమవారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జిల్లా కార్యదర్శి టి.రాజా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు.
భానుగుడి(కాకినాడ), ఏప్రిల్ 12: జిల్లాలో 2018-2020 డీఎడ్ మేనేజ్మెంట్ అండ్ స్పాట్ అడ్మిషన్ల విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలని కోరుతూ సోమవారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జిల్లా కార్యదర్శి టి.రాజా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం డీఆర్వోకు వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి టి.రాజా మాట్లాడుతూ 2018-20 సంవత్సరానికి సంబంధించిన విద్యార్థులకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహించడంతో పాటు పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ అసెంబ్లీలో ప్రకటించారని, అయినా నేటికీ పరీక్షలు నిర్వహించ లేదన్నారు.