డీఎడ్ మేనేజ్మెంట్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలి
ABN , First Publish Date - 2020-11-01T06:34:40+05:30 IST
డీఎడ్ మేనేజ్మెంట్ కోటాలో చేరిన విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి ప్రేమ్కుమార్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.
రావులపాలెం రూరల్, అక్టోబరు 31: డీఎడ్ మేనేజ్మెంట్ కోటాలో చేరిన విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి ప్రేమ్కుమార్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. తహశీల్దార్ జిలానీకి, ఎంపీడీవో రాజేంద్రప్రసాద్కు వినతిపత్రాలె అందజేశారు. ఈసందర్భంగా ప్రేమ్కుమార్ మాట్లాడుతూ జీవో నెం.30ను రద్దుచేసి విద్యార్థులకు వెంటనే పరీక్షలు నిర్వహించాలన్నారు. ర్యాలీలో యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు జ్యోతిబసు ఆధ్వర్యంలో సభ్యులు పాల్గొన్నారు.