అమ్మవారికి లక్ష గాజులతో అలంకరణ
ABN , First Publish Date - 2021-10-21T05:13:19+05:30 IST
పట్టుమహాదేవి కోనేరు గట్టుపై ఉన్న రామలింగేశ్వర స్వామి ఆలయం లోని లలితా త్రిపురసుందరి దేవిని బుధవారం లక్షా 10 వేల గాజులతో ప్రత్యేకంగా అలంకరించారు.
టెక్కలి రూరల్: పట్టుమహాదేవి కోనేరు గట్టుపై ఉన్న రామలింగేశ్వర స్వామి ఆలయంలోని లలితా త్రిపురసుందరి దేవిని బుధవారం లక్షా 10 వేల గాజులతో ప్రత్యేకంగా అలంకరించారు. గౌరీపౌర్ణమి సందర్భంగా ప్రధాన అర్చకుడు తర్లా శివకుమార్ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా భక్తులు అమ్మవారిని దర్శించుకుని తరించారు.