అభివృద్ధి పనులను పరిశీలించిన కలెక్టర్
ABN , First Publish Date - 2020-11-29T04:44:49+05:30 IST
నగరంలో ప్రారంభోత్సవాలకు సిద్ధం అవుతున్న పలు అభివృద్ధి పనులను శనివారం కలెక్టర్ ఆర్వీ కర్ణన్ పరిశీలించారు.
ఖమ్మం కలెక్టరేట్, నవంబరు 28: నగరంలో ప్రారంభోత్సవాలకు సిద్ధం అవుతున్న పలు అభివృద్ధి పనులను శనివారం కలెక్టర్ ఆర్వీ కర్ణన్ పరిశీలించారు. బల్లేపల్లి వైకుంఠధామం, ఇందిరానగర్ పార్కు, ఐటీహబ్, ఎన్నెస్పీ వాక్వే, ప్రారంభోత్సవ ఏర్పాట్లు పనులను కలెక్టర్ పరిశీలించారు. ఇంకా రెండు రోజుల వ్యవధి మాత్రమే ఉన్నందున ముగింపు పనులను త్వరగా పూర్తిచేయాలని ఆయా అధికారులను కలెక్టర్ ఆదేశించారు. బల్లేపల్లి వైకుంఠధామంలో అంతర్గత రోడ్లు, టాయిలెట్స్, ఫ్రీజర్, స్టోర్రూం, గ్రీనరీ, పెయింటింగ్ పనులను నిరాటంకంగా రేయింబవళ్లు కొనసాగించాలన్నారు. ఈనెల 30లోగా పూర్తిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఎన్నెస్పీ వాక్వే ముఖద్వారం గ్రీనరీ పనులను త్వరగా పూర్తిచేయాలన్నారు. ఇందిరాగనర్ పార్క్లో ఫౌంటెన్ పెయింటింగ్ లైటింగ్ గ్రీనరీ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. రఘునాధపాలెం పార్కు ప్రారంభోత్సవ శిలాఫలకం ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు. ఆయన వెంట నగర మేయర్ డాక్టర్ జి పాపాలాల్, నగరపాలక సంస్థ కమీషనర్ అనురాగ్ జయంతి, ఆర్అండ్బీ ఈఈ శ్యాంప్రసాద్, నగరపాలక సంస్థ ఇంజనీర్లు పాల్గొన్నారు.