హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించండి: ఎమ్మెల్సీ ఇక్బాల్

ABN , First Publish Date - 2022-01-31T23:03:23+05:30 IST

పుట్టపర్తి కేంద్రంగా శ్రీ సత్యసాయి జిల్లా ఏర్పాటు అధికార పార్టీ

హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించండి: ఎమ్మెల్సీ ఇక్బాల్

అనంతపురం: పుట్టపర్తి కేంద్రంగా శ్రీ సత్యసాయి జిల్లా ఏర్పాటు అధికార పార్టీ నేతల్లో చిచ్చు రేపుతోంది. హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని ఎమ్మెల్సీ ఇక్బాల్ అహ్మద్ పట్టుపడుతున్నారు. జిల్లా కేంద్రంగా ప్రకటించాలంటూ కలెక్టర్ నాగలక్ష్మికి ఎమ్మెల్సీ ఇక్బాల్, మున్సిపల్ కౌన్సిలర్లు వినతి పత్రం సమర్పించారు. ఇప్పటికే జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలంటూ మున్సిపల్ కౌన్సిల్‌లో తీర్మానం చేశారు. పుట్టపర్తిని జిల్లా కేంద్రంగా చేసినట్లయితే విదేశాల నుంచి వచ్చే వారికి అసౌకర్యంగా ఉంటుందన్నారు. పుట్టపర్తి వాసుల్లో ఇప్పటికీ వరదల భయం కూడా వెంటాడుతోందని ఆయన పేర్కొన్నారు. 

Updated Date - 2022-01-31T23:03:23+05:30 IST