గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని పొర్లు దండాలు

ABN , First Publish Date - 2021-07-25T07:35:01+05:30 IST

కేంద్ర ప్రభుత్వం గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలంటూ నెల్లూరుకు చెందిన బాలాజీ శనివారం పొర్లు దండాలతో శ్రీవారి మెట్టు మార్గాన తిరుమల చేరుకున్నారు

గోవును  జాతీయ ప్రాణిగా ప్రకటించాలని పొర్లు దండాలు

తిరుమల, జూలై 24(ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలంటూ నెల్లూరుకు చెందిన బాలాజీ శనివారం పొర్లు దండాలతో శ్రీవారి మెట్టు మార్గాన తిరుమల చేరుకున్నారు. తల్లి గోమాత కోసం తాను ఈ దీక్షకు పూనుకున్నట్టు మీడియాకు తెలిపారు. గతంలోనూ రెండు సార్లు పొర్లు దండాలతో తిరుమల వచ్చానని, ఈసారి గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలనే సంకల్పంతో కొండకు చేరుకున్నట్టు చెప్పారు. గోవులు ఉంటేనే మానవుడికి మనుగడ అన్నారు. గోవులను వధించి, ఆరగిస్తూ కొందరు మానవులు పాపాలను మూటగట్టుకుంటున్నారని బాలాజీ ఆవేదన వ్యక్తం చేశారు. 

Updated Date - 2021-07-25T07:35:01+05:30 IST