అమరావతిలో కరోనా ప్రాంతాలను కంటోన్మెంట్ జోన్లుగా ప్రకటన

ABN , First Publish Date - 2020-07-01T03:09:00+05:30 IST

అమరావతిలో కరోనా ప్రాంతాలను కంటోన్మెంట్ జోన్లుగా ప్రకటన

అమరావతిలో కరోనా ప్రాంతాలను కంటోన్మెంట్ జోన్లుగా ప్రకటన

అమరావతి: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. కోవిడ్-19 కట్టడి చర్యల్లో భాగంగా లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నప్పటికీ ఏపీలో రోజురోజుకూ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో అమరావతిలో కరోనా పాజిటివ్ కేసుల ప్రాంతాలను కంటోన్మెంట్ జోన్‌లుగా అధికారులు ప్రకటించారు.


ఈ నేపథ్యంలో అమరేశ్వరాలయంలో భక్తులకు దర్శనాల అనుమతులను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. తొలిఏకాదశి సందర్భంగా అమరావతి, వైకుంఠపురంలో దేవాలయాలలో ప్రత్యేక దర్శనాలను రద్దు చేశారు.

Updated Date - 2020-07-01T03:09:00+05:30 IST