ఏపీ కేబినెట్ నిర్ణయాలివే
ABN , First Publish Date - 2021-08-06T22:47:01+05:30 IST
సీఎం ఆధర్యంలో ఏపీ కేబినెట్ సమావేశమైంది. ఈ సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది. కేబినెట్ నిర్ణయాలను మంత్రి పేర్ని నాని మీడియాకు వివరించారు.
అమరావతి: సీఎం ఆధర్యంలో ఏపీ కేబినెట్ సమావేశమైంది. ఈ సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది. కేబినెట్ నిర్ణయాలను మంత్రి పేర్ని నాని మీడియాకు వివరించారు.
ఏపీ కేబినెట్ నిర్ణయాలు
ప్రాథమిక దశలోనే మెరుగైన విద్య అందించేలా చర్యలు
34 వేలకు పైగా ప్రాథమిక పాఠశాలల్లో మెరుగైన వసతులు
ప్రతి తరగతిలో తెలుగు మాధ్యమం తప్పనిసరిగా ఉంటుంది
నాడు-నేడు ద్వారా పాఠశాలల అభివృద్ధి
శాటిలైట్ ఫౌండేషన్ స్కూల్స్ PP1 పేరుతో అంగన్వాడీ స్కూళ్లలో విద్య నేర్పాలి
ఫౌండేషన్ స్కూల్స్లో PP1, PP2, 1, 2 తరగతులకు పాఠాలు
హైస్కూల్, హైస్కూల్ ప్లస్ స్కూళ్ల ఏర్పాటుకు ఆమోదం
2020-21 సంవత్సరానికి నేతన్న నేస్తం పథకం అమలుచేయాలని నిర్ణయం
ఈ నెల 24న 10 వేల నుండి 20 వేల డిపాజిట్ ఉన్న అగ్రిగోల్డ్ బాధితులకు పరిహారం చెల్లింపు
అభ్యంతరంలేని 300 చదరపు గజాల వరకు రేగ్యులరైజేషన్ చేయాలని నిర్ణయం
అక్టోబర్ 15, 2019 నాటికి ఆక్రమించుకొని నివాసం ఉంటున్న వారికి ఇది వర్తింపు
అసైన్డ్ ఇంటి స్థలాన్ని అమ్ముకునే అవకాశాన్ని.. 20 ఏళ్ల నుండి 10 ఏళ్లకు తగ్గిస్తూ కాబినెట్లో నిర్ణయం