14 తర్వాతే ‘విద్యాసంస్థల’పై నిర్ణయం
ABN , First Publish Date - 2020-04-06T07:11:36+05:30 IST
కరోనా మహమ్మారి కట్టడికి దేశవ్యాప్తంగా అమలులో ఉన్న లాక్డౌన్ కాలపరిమితి ముగిసిన తర్వాతే పాఠశాలలు, కళాశాలల పునఃప్రారంభంపై నిర్ణయం తీసుకోనున్నట్లు కేంద్ర మానవ వనరుల...
న్యూఢిల్లీ, ఏప్రిల్ 5 (ఆంధ్రజ్యోతి): కరోనా మహమ్మారి కట్టడికి దేశవ్యాప్తంగా అమలులో ఉన్న లాక్డౌన్ కాలపరిమితి ముగిసిన తర్వాతే పాఠశాలలు, కళాశాలల పునఃప్రారంభంపై నిర్ణయం తీసుకోనున్నట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ స్పష్టం చేశారు. ఆయన ఆదివారక్కడ విలేకర్లతో మాట్లాడారు. ఈ నెల 14 వరకు లాక్డౌన్ ఉందని, అది ముగిసిన తర్వాతే విద్యా సంస్థలను తిరిగి ప్రారంభించడంపై సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. 14 తర్వాత కూడా విద్యా సంస్థలన్నీ మూసివేయాల్సిన పరిస్థితి వస్తే విద్యార్థులు విద్యాసంవత్సరం నష్టపోకుండా తగిన చర్యలు తీసుకుంటామన్నారు.