ఎవరికీ తెలియకుండా ఇంట్లో నుంచి బయటికొచ్చిన Wife.. ఆయనతో కలిసి ఆత్మహత్య.. చివరికి Shocking విషయాలు వెలుగులోకి..!

ABN , First Publish Date - 2021-12-18T19:36:29+05:30 IST

ఎవరికీ తెలియకుండా ఇంట్లో నుంచి బయటికొచ్చిన Wife.. ఆయనతో కలిసి ఆత్మహత్య.. చివరికి Shocking విషయాలు వెలుగులోకి..!

ఎవరికీ తెలియకుండా ఇంట్లో నుంచి బయటికొచ్చిన Wife.. ఆయనతో కలిసి ఆత్మహత్య.. చివరికి Shocking విషయాలు వెలుగులోకి..!

  • బెదిరించి అత్యాచారం..!
  • ఆత్మహత్యాయత్నం చేసిన ఇద్దరు 
  • వికారాబాద్‌ కేసు మూలాలు ఎస్సార్‌ నగర్‌లో..

హైదరాబాద్‌ సిటీ/అమీర్‌పేట్‌ : ఈ నెల 14న వికారాబాద్‌ జిల్లా, చెన్నుగోముల పోలీస్‌స్టేషన్‌లో నమోదైన ఆత్మహత్యాయత్నం కేసు మూలాలు ఎస్సార్‌నగర్‌ పీఎస్‌ పరిధిలో వెలుగు చూశాయి. ఇద్దరు యువకులు బ్లాక్‌ మెయిల్‌ చేసి అత్యాచారానికి ఒడిగట్టడంతో మనస్తాపానికి గురైన మహిళ, ఆమెతో సంబంధం ఏర్పరుచుకున్న వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. తొలుత ప్రేమికులు ఆత్మహత్యాయత్నం అని వార్తలు వచ్చినప్పటికీ, వాస్తవాలు భిన్నంగా ఉన్నాయి.


అసలేం జరిగింది..!

ఎస్సార్‌ నగర్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వనపర్తి జిల్లాకు చెందిన మహిళ (32)కు 15 ఏళ్ల క్రితం వివాహమైంది. నగరంలో ఉంటున్నారు. ఆమెకు ఇద్దరు పిల్లలున్నారు. పని చేసే ప్రాంతంలో ఒకరితో ఆమెకు పరిచయం ఏర్పడింది. అది వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ నెల 13న రాత్రి 11 గంటలకు భర్త, పిల్లలు పడుకున్న తర్వాత అతడు ఆమె ఇంటికి వచ్చాడు. అక్కడే ఉంటున్న ఇద్దరు యువకులు అతడిని ఆపి ఫోన్‌ లాక్కున్నారు. వివాహేతర సంబంధం గురించి ఆమె భర్తకు చెబుతామని బెదిరించారు. అలజడి విన్న బాధితురాలు ఇంట్లో నుంచి బయటకు వచ్చింది. ఆమెను చూసి విషయం ఎవరికీ చెప్పకుండా ఉండాలంటే తాము చెప్పినట్లు వినాలని బెదిరించారు. ఆ క్షణంలో ఏం చేయాలో తోచని వారు ఆ యువకుల డిమాండ్‌కు తలొగ్గారు. ఆమెను పక్కనే ఉన్న ఓ గదిలోకి తీసుకెళ్లి ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు.


ఆయనకు ఫోన్ చేసి..!

అనంతరం ఫోన్‌ ఇచ్చేసి వెళ్లిపోయారు. బాధితులు కూడా తమ ఇళ్లకు వెళ్లిపోయారు. జరిగిన అవమానాన్ని భరించలేని బాధితురాలు ఆత్మహత్య చేసుకుంటానంటూ అతడికి ఫోన్‌ చేసింది. ఇద్దరం కలిసే ఆ పని చేద్దామని చెప్పి ఆమెను తనతో రావాలని అతడు చెప్పాడు. ఈ నెల 14న హైటెక్‌ సిటీ వద్దకు పని నిమిత్తం వెళ్లిన బాధితురాలు ఉదయం 10.20 గంటలకు భర్తకు చెప్పకుండా అక్కడి నుంచి వెళ్లిపోయింది. అప్పటికే ఆమెకోసం ఎదురు చూస్తున్న అతను బైకుపై కూర్చొబెట్టుకుని బయలుదేరాడు. దారిలో పురుగుల మందు బాటిల్‌ కొనుక్కుని కొండపల్ల గేట్‌ వద్ద ఉన్న అటవీ ప్రాంతంలోకి వెళ్లారు. అక్కడ ఇద్దరూ పురుగుల మందు తాగారు.


అనంతరం అతను తన సోదరుడికి ఫోన్‌ చేసి అక్కడ బైకు ఉన్న సమాచారం ఇచ్చిన తర్వాత స్పృహ కోల్పోయాడు. వెంటనే అక్కడికి చేరుకున్న సోదరుడు పొదల్లో వారిని గుర్తించి స మీపంలో ఉన్న ఆస్పత్రికి చేర్చి చెన్నుగోముల పీఎస్‌లో సమాచారం ఇచ్చాడు. పోలీసుల సాయంతో నానల్‌నగర్‌లోని ప్రీమియర్‌ ఆస్పత్రికి వారిని తరలించారు. కోలుకున్న బాధితురాలు శుక్రవారం ఎస్సార్‌ నగర్‌ పీఎస్‌కు చేరుకుని జరిగిన అన్యాయాన్ని వివరించింది. తనపై అత్యాచారానికి పాల్పడిన వారిని గుర్తుపడతానని, ఇస్మాయిల్‌, యాసిన్‌లుగా పిలుచుకున్నారని ఆమె పోలీసులకు తెలిపింది. పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

Updated Date - 2021-12-18T19:36:29+05:30 IST