అప్పుల బాధ తాళలేక దంపతుల ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-04-21T06:14:41+05:30 IST

ఏడాది క్రితం వివా హం చేసుకున్న దంప తులు.. అప్పులబాధ భరిం చలేక ఆత్మహత్య చేసుకు న్నారు. సంఘటన పెద్ద పంజాణి మండలం మద్దలకుంట గ్రామంలో మంగళవారం జరిగింది.

అప్పుల బాధ తాళలేక దంపతుల ఆత్మహత్య
గంగాధరం, సోనియా (ఫైల్‌ఫొటో)

మద్దలకుంటలో విషాదం


పెద్దపంజాణి, ఏప్రిల్‌ 20 : ఏడాది క్రితం వివా హం చేసుకున్న దంప తులు.. అప్పులబాధ భరిం చలేక ఆత్మహత్య చేసుకు న్నారు. సంఘటన పెద్ద పంజాణి మండలం మద్దలకుంట గ్రామంలో మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివ రాల మేరకు... పెద్ద పంజాణి మండలం మద్దల కుంట గ్రామా నికి చెందిన సుబ్రహ్మణ్యం కుమార్తె సోనియా(19)కు ఏడాది క్రితం మదనపల్లె మండల టేకుపాళ్యం గ్రామానికి చెందిన రమణ కుమారుడు గంగాధరం(22)తో వివాహమైంది. సోనియా ఎనిమిది నెలల గర్భవతి. అయితే గంగాధరం టేకుపాళ్యంలో ఇంటి నిర్మాణం, వ్యాపారం కోసం అప్పులు చేశాడు. అప్పులు చెల్లించాలని రుణ గ్రహీతలు ఒత్తిడి తేవడంతో వారు  మద్దలకుంటకు వచ్చి మామ సుబ్ర హ్మణ్యంకు తెలిపి సహాయం చేయాల్సిందిగా కోరారు. వారం రోజుల్లో సమ స్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో మామగారి ఇంటనే ఉంటున్నారు. అయితే తల్లిదండ్రుల పరిస్థితిని గ్రహించిన సోనియా ఇక ఆత్మహత్యే శరణ్య మని తలచింది. మాట్లాడుకున్న దంపతులు సోమవారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో భోజనం చేసిన తరువాత అలా చల్లగాలికి తిరిగి వస్తామని ఇంట్లో  తెలిపి బయటకు వెళ్ళారు. కానీ ఇంటికి రాలేదు. దీంతో రాత్రంతా సుబ్రహ్మణ్యం , బంధువులు గాలించారు. కానీ కనిపించలేదు. ఉదయం పది గంటల సమయంలో ఊరి బయట పాడుబడిన బావి వద్ద చెప్పులు, సెల్‌ ఉండడాన్ని గమనించి బావిలో గాలించారు. మొదట అమ్మాయి శవం బయట పడింది. అయితే గంగాధరం శవం లభించలేదు. మోటర్లు ఉపయోగించి బావిలో నీటిని తోడివేయగా శవం బయటపడింది. దంపతుల ఆత్మహత్యతో మద్దలకుంటలో విషాదం నెలకుంది. పెద్దపంజాణి ఎస్‌ఐ మల్లికార్జున రెడ్డి కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 

Updated Date - 2021-04-21T06:14:41+05:30 IST