విధ్వంస పాలనపై చర్చకు సిద్ధం: బొండా ఉమ

ABN , First Publish Date - 2020-06-07T08:52:07+05:30 IST

ఏడాది విధ్వంస పాలన అంశంపై చర్చకు రావాలని వైసీపీ విసిరిన సవాల్‌ను టీడీపీ స్వీకరించింది. ‘‘మేం సిద్ధంగా ఉన్నాం. విధ్వంసం ఎక్కడ అంటున్నారు. ఎక్కడో చూపిస్తాం. చర్చకూడా ఎక్కడో అక్కర్లేదు. మీ ముఖ్యమంత్రి ఉంటున్న తాడేపల్లిలోనే..

విధ్వంస పాలనపై చర్చకు సిద్ధం: బొండా ఉమ

ఏడాది విధ్వంస పాలన అంశంపై చర్చకు రావాలని వైసీపీ విసిరిన సవాల్‌ను టీడీపీ స్వీకరించింది. ‘‘మేం సిద్ధంగా ఉన్నాం. విధ్వంసం ఎక్కడ అంటున్నారు. ఎక్కడో చూపిస్తాం. చర్చకూడా ఎక్కడో అక్కర్లేదు. మీ ముఖ్యమంత్రి ఉంటున్న తాడేపల్లిలోనే... ఏ సందులో అయినా 10మంది ప్రజలను కలిసి అడుగుదాం. టీడీపీ పాలన ఎలా ఉందో, వైసీపీ పాలన ఎలాఉందో వారే చెబుతారు. ఈ మాత్రం చర్చకు చంద్రబాబో, లోకేశో అవసరం లేదు. మా పార్టీ ఆఫీసులో పనిచేసే ఆఫీస్‌ బాయ్‌ చాలు. ఎప్పుడు వస్తారో చెప్పండి’’ అని టీడీపీ అధికార ప్రతినిధి బొండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు.

Updated Date - 2020-06-07T08:52:07+05:30 IST