స్పెయిన్‌లో మరణ మృదంగం

ABN , First Publish Date - 2020-03-26T14:12:52+05:30 IST

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ స్పెయిన్‌లో మరణ మృదంగం కొనసాగుతోంది.

స్పెయిన్‌లో మరణ మృదంగం

మాడ్రిడ్ (స్పెయిన్) : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ స్పెయిన్‌లో మరణ మృదంగం కొనసాగుతోంది. బుధవారం ఒక్కరోజే కరోనాతో 738 మంది మృతి చెందారు. స్పెయిన్‌లో కరోనాతో ఇప్పటివరకు 3,434 మంది మృతి చెందగా.. 47,610 మందికి కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 


కాగా స్పెయిన్ ఉప ప్రధానమంత్రి కార్మెన్ కాల్వోకు సోకిందని స్పానిష్ సర్కారు బుధవారం రాత్రి ప్రకటించింది. స్పెయిన్ డిప్యూటీ ప్రధానమంత్రి కార్మెన్ కాల్వోకు పరీక్షలు చేయగా కొవిడ్-19 పాజిటివ్ రావడంతో ఆమెను ఐసోలేషన్ వార్డుకు తరలించారు. ప్రపంచంలో ఇటలీ తర్వాత స్పెయిన్ దేశంలోనే అత్యధికంగా 50 వేలమందికి కరోనా వైరస్ సోకింది. 

Updated Date - 2020-03-26T14:12:52+05:30 IST