జపాన్ వరదల్లో 50 మంది మృతి

ABN , First Publish Date - 2020-07-07T15:35:48+05:30 IST

జపాన్ దేశంలో కురుస్తున్న భారీవర్షాల వల్ల వెల్లువెత్తిన వరదల్లో మృతుల సంఖ్య 50కి చేరింది.....

జపాన్ వరదల్లో 50 మంది మృతి

మరో 12 మంది గల్లంతు

టోక్యో (జపాన్) : జపాన్ దేశంలో కురుస్తున్న భారీవర్షాల వల్ల వెల్లువెత్తిన వరదల్లో మృతుల సంఖ్య 50కి చేరింది. జపాన్ దేశం దక్షిణ ప్రాంతంలోని కైషూ ప్రాంతంలో భారీవర్షాల వల్ల వరదలు వెల్లువెత్తాయి. నదీ తీర ప్రాంతమైన కుమామోటో రీజియన్ లో వరదల వల్ల 50 మంది మరణించారని జపాన్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ ఏజెన్సీ అధికారులు చెప్పారు. ఫూకోక ప్రాంతంలో కురిసిన భారీవర్షాల వల్ల 12 మంది గల్లంతు అయ్యారని అధికారులు చెప్పారు. జపాన్ అధికారులు సహాయ పునరావాస కార్యక్రమాలు చేపట్టారు. 

Updated Date - 2020-07-07T15:35:48+05:30 IST