తల్లి మృతిచెందిన వారం రోజులకే!

ABN , First Publish Date - 2021-09-19T05:26:39+05:30 IST

తల్లి మృతిచెందిన వారం రోజులకే!

తల్లి మృతిచెందిన వారం రోజులకే!

తల్లి మృతిచెందిన వారం రోజులకే!

కుమార్తె మృతి

లారీ రూపంలో కబళించిన మృత్యువు

రౌతుపేటలో విషాదం

చీపురుపల్లి, సెప్టెంబరు 18: తల్లి వారం రోజుల కిందట అనారోగ్యంతో మృత్యువాత పడింది. ఆ చిన్నారిని పిన్ని చేరదీసింది. కంటికిరెప్పలా కాపాడుతూ వస్తోంది. విషాదాన్ని మరిపించేందుకు పాఠశాలలో చేర్పించింది. ఇంతలోనే ఘోరం జరిగిపోయింది. లారీ రూపంలో మృత్యువు కబళించింది. లావేరు మండలం రౌతుపేటకు చెందిన రౌతు జ్ఞానేశ్వరి (8) అనే చిన్నారి విషాదాంతం ఇది. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో జరిగిన ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. చీపురుపల్లి ప్రధాన రహదారిపై శనివారం లారీ బైక్‌ను ఢీకొన్న ఘటనలో రౌతు జ్ఞానేశ్వరి, కెల్ల యోషిత (3) అనే ఇద్దరు చిన్నారులు దుర్మరణం పాలయ్యారు. ఉపేంద్ర అనే వ్యక్తి తీవ్రగాయాలపాలయ్యాడు. జి.అగ్రహారానికి చెందిన కెల్ల ఈశ్వరరావు, జగదీశ్వరిల కుమార్తె యోషితో పాటుఅదే వీధికి చెందిన జ్ఞానేశ్వరిలు పట్టణంలో ఓ ప్రైవేటు స్కూల్‌లో చదువుతున్నారు. గత వారం రోజులుగా పాఠశాలకు వెళ్తున్నారు. శనివారం ఉదయం సమీప బంధువు ఉపేంద్ర బైక్‌పై పిల్లలిద్దర్నీ స్కూల్‌కు తీసుకెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులూ మృతిచెందారు. ఇందులో జ్ఞానేశ్వరిది లావేరు మండలం రౌతుపేట. వారం రోజుల కిందట తల్లి శ్రీదేవి అనారోగ్యంతో మృతిచెందింది. దీంతో శ్రీదేవి సోదరి అయిన చందక ఉమ జ్ఞానేశ్వరిని చేరదీసి పెంచుకుంటోంది. ఇంతలోనే ఘోరం జరిగిపోయింది. మృతదేహాల వద్ద తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.  ఎస్‌ఐ ఎ.సన్యాసినాయుడు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Updated Date - 2021-09-19T05:26:39+05:30 IST