మరణాల రేటు 1 శాతం మించొద్దు
ABN , First Publish Date - 2020-07-05T08:39:22+05:30 IST
కరోనా మరణాల రేటు ఒక శాతం కంటే తక్కువగా ఉండేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ ఆదేశించారు.కరోనా నియంత్రణ చర్యలు,
- కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ
అమరావతి, జూలై 4(ఆంధ్రజ్యోతి): కరోనా మరణాల రేటు ఒక శాతం కంటే తక్కువగా ఉండేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ ఆదేశించారు.కరోనా నియంత్రణ చర్యలు, వైరస్ వ్యాప్తి నివారణకు కేంద్ర హోంశాఖ మార్గదర్శకాల అమలు తదితర అంశాలపై శనివారం ఆయన రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యద ర్శులతో వీడియో కాన్ఫరెన్ ్స నిర్వహించారు. కొవిడ్ లక్షణాలు ఉన్నవారికి వీలైనంత అధిక సంఖ్యలో టెస్టులు నిర్వహించాలని, మాస్క్ ధరించడం, భౌతికదూరాన్ని పాటించడం వంటి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు పెట్టాలన్నారు.