మడుగులో మృత్యువు

ABN , First Publish Date - 2021-07-31T05:17:45+05:30 IST

బొడ్డగూడ పంచాయతీ పరిధిలోని తివ్వకొండ శిఖరంలో ఉన్న కోటకొండ గ్రామంలో ఇద్దరి గిరిజన బాలికలు గుంతలో పడి ప్రాణాలు కోల్పోయారు.

మడుగులో మృత్యువు
మృతదేహాల వద్ద రోదిస్తున్న కుటుంబ సభ్యులు

గుంతలో దిగిన విద్యార్థినులు

బురదలో కూరుకుపోయి మృతి

కోటకొండలో విషాదం

భామిని, జూలై 30: బొడ్డగూడ పంచాయతీ పరిధిలోని తివ్వకొండ శిఖరంలో  ఉన్న కోటకొండ  గ్రామంలో ఇద్దరి గిరిజన బాలికలు గుంతలో పడి ప్రాణాలు కోల్పోయారు. గ్రామస్థుల కథ నం మేరకు.. కోటకొండ  గ్రామానికి చెందిన స్నేహితులు పాలక కీర్తి(13), ఆరిక అంజిలి(13) శుక్రవారం మధ్యాహ్నం బావి వద్దకు స్నానానికి వెళ్లారు. బావి పక్కనే ఉన్న గుంతలో దిగారు. అక్కడ లోతు ఎక్కువగా ఉండడంతో ఇద్దరూ బురదలో కూరుకుపో యారు. వారితో వెళ్లిన మరో బాలిక గ్రామంలోకి వచ్చి సమాచా రం తెలియజేసింది. గ్రామస్థులు సంఘటన స్థలానికి చేరుకొని గుంతలో దిగి బయటకు తీసేసరికే వారిద్దరూ మృతి చెందారు. గ్రామపెద్దల ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ బి.అనీల్‌కుమార్‌ ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. శనివారం పాలకొండ ఏరియా ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను తరలిస్తామని చెప్పారు. కీర్తి, అంజలి విజయనగరం జిల్లా ఉదయపురం రెసిడెన్షి యల్‌ పాఠశాలలో ఏడో తరగతి పూర్తిచేశారు. కరోనా వల్ల పాఠశాలలు మూతపడడంతో ఇంటి వద్దనే ఉంటున్నారు. ఆరిక అంజిలి తండ్రి గురుము, తల్లి గంగ, పాలక కీర్తి తండ్రి అప్పన్న, తల్లి మౌసమిలు వ్యవసాయ పనులు చేసుకొని జీవిస్తున్నారు. కుమార్తెల మృతితో ఆ రెండు కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి. 

Updated Date - 2021-07-31T05:17:45+05:30 IST